లండన్ : తెలుగు రాష్ట్రాల నుండి బ్రిటన్కు గత ఏడాదిగా ఉన్నత చదువుకోసం వచ్చిన వేలాది మంది విద్యార్థులు కరోనా మహమ్మారి వ్యాప్తితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎన్నారై టీఆర్ఎస్ యూకే విభాగం ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల అన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన తెలిపారు.టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలకు దూరంగా ఉంటూ ‘కేసీఆర్ కూపన్స్’ పేరుతో సామాజిక దూరాన్ని పాటిస్తూ సుమారు 200లకు పైగా విద్యార్థులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను వారి స్థానిక దుకాణాలల్లో తీసుకునేలా ఏర్పాటు చేశామని అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.
లండన్లో ‘కేసీఆర్ కూపన్స్’తో విద్యార్థులకు సహాయం